09-07-12

శాసనాలు -- న్యాయస్థానాలు


శాసనాలు

ప్రభుత్వ స్వరూపాన్ని,నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను నిర్ణయించే ఒక అద్భుత మూలాధార చట్టమే "రాజ్యాంగం".
రాజ్యంలోని పౌరులందరూ శాసనాల ప్రకారం నడచుకుంటే వారి మధ్య విభేదాలు వుండవు,కానీ అనేక రకాల స్వభావాలున్న వారి వలన వివాదాలు తలెత్తుతాయి.

వీటికి ప్రధాన కారణం ఆర్ధిక నేరాలకు పాల్పడటం.రుణ చెల్లింపులు,ఆస్తుల పంపకం,అమ్మకాల వంటివి. ఇలాంటి వివాదాలు ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా
వ్యక్తీకీ , ప్రభుత్వానికి , లేదా రెండు ప్రభుత్వాల మధ్యన తలెత్తవచ్చు.
ఐతే ప్రతి వివాదం లో రెండు,అంతకంటే ఎక్కువ పక్షాలు ఉండవచ్చు. వీరిలో ఒక పక్షం మరొక పక్షంపై న్యాయ స్థానంలో తమ సమస్యను గురించి ఫిర్యాదు చేయవచ్చు.

ఇలా ఫిర్యాదు చేసే పక్షాన్ని 'ఫిర్యాది' లేదా 'వాది' అని,రెండో పక్షాన్ని 'ప్రతివాది' అనీ అంటారు.

న్యాయస్థానాలు

సుప్రీంకోర్ట్ అఫ్ ఇండియా


రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాధమిక హక్కులకు ఆటంకం ఏర్పడితే న్యాయస్థానాలు రక్షణ కల్పిస్తాయి.ప్రాధమిక హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా 'రాజ్యాంగ పరిహార హక్కును' కూడా కల్పించారు.బాధితులు న్యాయం కోసం వివిధ న్యాయ స్థానాలలో ఫిర్యాదు చేస్తారు.దేని ఆధారంగా కోర్టు కేసులను నమోదు చేయిస్తుంది.

కేసులను 3 రకాలుగా విభజించవచ్చు.
1.సివిల్ కేసులు
2.క్రిమినల్ కేసులు
3.రాజ్యాంగ సంబంధమైన కేసులు


1.సివిల్ కేసులు :
స్థిర,చరాస్తులకు,వ్యవహారాల ఒప్పందాలకు,సామాజిక,కుటుంబ సంబంధ వివాదాలకు సంబంధించినవి. ఇలాంటి పౌర సంబంధమైన (సివిల్) కేసులను మున్సిఫ్ కోర్టులు,జిల్లా సివిల్ కోర్టులు మాత్రమే విచారించి,పరిష్కరిస్తాయి.

2.క్రిమినల్ కేసులు :
సంఘ విద్రోహ చర్యలకు,వ్యక్తుల మధ్య దౌర్జన్యాలకు సంబంధించినవి.శాంతి భద్రతలను సంబంధించిన తగాదాలు కాబట్టి ఇలాంటి కేసులను మేజిస్ట్రేట్ కోర్టులు,జిల్లా కోర్టులు విచారించి,సమస్యను పరిష్కరిస్తాయి. అయితే కొన్ని న్యాయస్థానాలు సివిల్,క్రిమినల్ కేసులు రెండిటినీ విచారిస్తాయి.

3.రాజ్యాంగ సంబంధమైన కేసులు :
రాజ్యాంగ సంబంధిత ఉన్నత కేసులను హైకోర్టు,సుప్రీం కోర్టులు విచారిస్తాయి. రాష్ట్రం లో వుండే న్యాయస్థానాల
నన్నింటి
లోనూ హైకోర్టు,దేశానికంతటికీ సుప్రీం కోర్టు ఉన్నతమైనవి.

పౌరుల ప్రాధమిక హక్కులకు న్యాయష్టానాలు రక్షణ కల్పిస్తాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన శాసనాలు లేదా వాటి ద్వారా రూపొందిన నిబంధనల
వలన పౌరహక్కులకు భంగం వాటిల్లిన సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి.

సంబంధిత శాసనాలపై వ్యాఖ్యానించి,అవసరమైతే దానికి కారణమైన ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లవని తీర్పిస్తాయి.
ఇలాంటి తీర్పునిచ్చే అధికారం సుప్రీం,హైకోర్టులకు ఉంటుంది.

హైకోర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్


న్యాయస్థానాల స్వతంత్ర ప్రతిపత్తి

అధికారవిభజన ద్వారానే ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేస్తుంది. అందుకే శాసన నిర్మాణ బాధ్యత శాసన సభలకు,వాటి అమలు బాధ్యత కార్య నిర్వాహణ శాఖకు, వివాదాలు తలెత్తినప్పుడు వాటిపై వ్యాఖ్యానించే బాధ్యత న్యాయ శాఖకు అప్పగించారు.

దేశంలోని మొత్తం న్యాయ స్థానాలను కలిపి న్యాయ శాఖ అంటారు. జాతీయ స్థాయిలో సుప్రీం కోర్టు,రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఉన్నత న్యాయ స్థానాలు. న్యాయ శాఖ రాజ్యాంగానికి రక్షణ కల్పిస్తుంది.

కార్య నిర్వాహక శాఖ ఆజమాయిషీలో ఉంచకుండా స్వయం ప్రతిపత్తితో,నిష్పక్షపాతంగా ప్రజలకు న్యాయాన్ని అందించేలా న్యాయశాఖకు రాజ్యాంగంలో ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారు.

ఇందులో భాగంగానే సుప్రీం కోర్టు,
హైకోర్టు న్యాయ మూర్తులను రాజ్యాంగ రీత్యా రాష్ట్ర పతి నియమించినా,
వారిని పదవి నుంచి తొలగించే తొలగించటానికి ఆయనకు అధికారం వుండదు. అంటే వారిపై వచ్చిన అభియోగాలపై
శాసన నిర్మాణ సభలు చర్చించి,2/3 వంతు మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాలి.అప్పుడే వారిని పదవీచ్యుతులను చేయటం సాధ్యమవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి