09-07-12

న్యాయనిర్వహణ వ్యవస్థ


న్యాయనిర్వహణ వ్యవస్థ


సుప్రీం కోర్ట్

సుప్రీం కోర్ట్ మన దేశ అత్యున్నత న్యాయస్థానం. న్యూ ఢిల్లీ లో వుంది.ఇందులో ప్రధాన న్యాయమూర్తితో పాటు 30 మంది న్యాయ మూర్తులు వుంటారు.సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ
మూర్తి ని రాష్ట్రపతి నియమిస్తారు. ఇతరుల నియామకంలో ప్రధాన న్యాయమూర్తి సలహా తీసుకుంటారు.
ప్రస్తుత సుప్రీం కోర్టు 38 వ ప్రధాన న్యాయమూర్తిగా ఎస్.హెచ్.కపాడియా వ్యవహరిస్తున్నారు.రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి లేని సందర్భంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తే రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.

సుప్రీం కోర్టు తీర్పుకు దేశంలోని పౌరులు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లోబడి వుండాలి.దీని తీర్పుపై అప్పీలు చేసే అవకాశం లేదు.అయితే ఒక పౌరుడికి కోర్టు మరణ శిక్ష విధిస్తే అతడికి క్షమాభిక్ష పెట్టటానికి,లేదా శిక్షను తగ్గించి,యావజ్జీవ కారాగార శిక్షగా మార్చటానికి రాష్ట్ర పతికి మాత్రం అధికారం వుంటుంది.


రాష్ట్ర హైకోర్టులు



భారత రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి ఉన్నత న్యాయ స్థానం ఉండాలని నిర్దేశిస్తుంది.కానీ ప్రత్యేక పరిస్థితుల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక హైకోర్టు ఉండేలా పార్లమెంట్ నిర్ణయించవచ్చు.ప్రస్తుతం మన దేశం లో మొత్తం 24 హైకోర్టులు వున్నాయి. ( ఇటీవల లోక్ సభ 12,మే 2012 న త్రిపుర,మేఘాలయ ,మణిపూర్ లకు స్వతంత్ర హైకోర్టులను ఆమోదించింది.వీటితో కలిపి మొత్తం 24 )

మన రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్ లో ఉంది. ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం జస్టిస్ పినాకి చంద్రఘోష్ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటూ 38 మంది న్యాయ మూర్తులు ఉన్నారు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతి నియమిస్తారు.అయితే రాభారట ప్రధాన న్యాయమూర్తి,రాష్ట్ర గవర్నర్లను సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు.

జిల్లా న్యాయస్థానాలు

1.జిల్లా సివిల్ కోర్టులు
2.జిల్లా సెషన్స్ కోర్టులు
3.సబ్ కోర్టులు
4.మున్సిఫ్ కోర్టులు
5.మేజిస్ట్రేట్ కోర్టులు

హైకోర్టులు,సివిల్.క్రిమినల్ కేసులను విచారిస్తాయి.కోర్టు విచారణలో నేరం రుజువైతే చట్టప్రకారం శిక్ష విధిస్తాయి.అయితే ఒక్కొక్క కోర్టుకి కొన్ని పరిమితులుంటాయి.జిల్లా సెషన్స్ కోర్టుకి మరణ శిక్ష విధించే అధికారం వుంది. కానీ కింది కోర్టులకు అలాంటి అధికారం లేదు.కింది కోర్టుల తీర్పులపై పై
కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.

జిల్లాలోని అన్ని సివిల్,క్రిమినల్ కోర్టులు జిల్లా న్యాయమూర్తి ఆజమాయిషీలో ఉంటాయి. ఈయనే జిల్లా సెషన్సు కోర్టు న్యాయమూర్తిగా కూడా వ్యవహరిస్తారు.పని భారం ఎక్కువైతే అదనంగా మరో న్యాయమూర్తిని నియమిస్తారు.జిల్లా జడ్జిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి గవర్నర్ నియమిస్తారు ,ఈ విధంగా రాష్ట్రంలో న్యాయస్థానాలన్నీ ఒక శాఖగా పనిచ్చేస్తాయి.

ప్రజా న్యాయస్థానం ( లోక్ అదాలత్ )

కొన్నిసార్లు న్యాయ స్థానంలొ కేసుల పరిష్కారానికి సంవత్సరాల కొద్దీ ఎదురు చూడల్సి వస్తుంది. అలాగే వాది-ప్రతివాది పరిష్కారాలకు సుముఖంగా ఉండరు. కొన్ని కేసులను తేలికగా పరిష్కరించటానికి వీలుంటుంది.మరి కొన్ని కేసులు పెద్ద మనుషుల మధ్యవర్తిత్వంతో ఒక కొలిక్కి తీసుకు రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆయా కేసులను పరిష్కరించి,చట్టబద్ధమైన ప్రతిపత్తి కల్పించే వ్యవస్థే ప్రజా న్యాయ స్థానం ( లోక్ అదాలత్ )
మన రాష్ట్రం లో ప్రస్తుతం 70 వరకు లోక్ అదాలత్ లు ఉన్నాయి.సాధారణ న్యాయ స్థానాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తి లోక్ అదాలత్ న్యాయాధిపతిగా వ్యవహరిస్తారు.దీని ద్వారా కేసులు త్వరగా పరిష్కారమవుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి